Tag: మాతృభాష

  • తెలుగు బాష ప్రాముఖ్యత (ప్రథమ బహుమతి పొందిన వ్యాసం)

    తెలుగుభాష యొక్క ప్రాముఖ్యత

    ఉపోద్గాతము :  “చక్కని పలుకుబడులకు, నుడికారములకు తెలుగు బాషయే పుట్టినిల్లు ”. చక్కని కవితలల్లిక లో జిగిబిగిని ప్రదర్శించిన నేర్పు ఈ బాషలోనే వీలైనది. అంతేగాక, అనేక బాషలు ఈ బాషలో చోటు చేసుకున్నాయి. ఎప్పుడైనా ఒక బాష  గొప్పతనం అన్ని బాషలూ నేర్చినగానీ తెలియదు. సంస్కృతము, తమిళము, పారసి మున్నగు బాషలు తెలిసిన రాయలు దేశబాషలందు  తెలుగులెస్స అనుట ఆశ్చర్యం గాదు. బ్రౌనుదొర కూడాఈ బాషను గూర్చి వేనోళ్ల పొగుడుట మన తెలుగు వారి, తెలుగు బాష యెక్క గౌరవము.

    దేశ బాషలందు తెలుగు లెస్స: మన తెలుగు బాష దేశ బాషలలో గొప్పది. దేశబాషలందు తెలుగులెస్స, అని శ్రీకృష్ణదేవరాయలు తన “ఆముక్తమాల్యద” లో ఆంధ్రమహావిష్ణువు చే చెప్పించాడు. ఈ మాట ప్రతి తెలుగు వారి గుండెలలో నిరంతరం ప్రతిధ్వనిస్తూనే ఉంటుంది. రాయల పైమాట తెలుగు వారి యెక్క మాతృబాషాభిమానానికి మేలుకొలుపు పాట అయ్యింది. బహుబాషా కోవిదుడైన రాయలు, ఆ బాష లోతుపాతులనెరిగి, మధించి భువన విజయ వికమాదిత్య న్యాయాధిపతిగా చెప్పిన తీర్పు దేశబాషలందు  తెలుగులెస్స అన్న మాట.

    తెలుగు  బాష మాధుర్యం:   తెలుగు బాష మాధుర్యానికి కారణాలను పరిశేలిద్దాం. తెలుగు ద్రావిడ బాషలలో నుండి పుట్టింది. సహజముగా ద్రావిడ లక్షణములను బట్టి సరళము, సుకుమారము అయిన తెలుగువాణి, సంస్కృత బాషా కైకర్యం, గాంభీర్య పటుత్వాలను అలవరుచుకొని, తల్లికి, అక్కా చెల్లెండ్రకూ లేని క్రొత్త అందాలను అలవరుచుకుంది.

    తెలుగు బాష సస్యశ్యామలమైనది: తెలుగు గడ్డ కవితా సస్యశ్యామలమైనది. సహృదయ సామ్రాట్ అయిన శ్రీకృష్ణదేవరాయలు ఏ బాష వాడైనా, తెలుగు బాషకే కావితాకర్పూర నీరాజనం అందించాడు.

    “తరిపి వెన్నెల! ఆణిముత్యాల జిలుగు
    పునుగు జివ్వాజీ! ఆమని పూల వలపు
    మురళి రవాళులు! కస్తూరి పరిమళములు
    కలిసి ఏర్పడే సుమ్ము మా తెలుగు బాష” అని నండూరి వారు అన్నారు.

    తెలుగు బాష  కోటి కిటికీల గాలి మేడ:  తెలుగు బాష   కొల్లలుగా క్రొత్త పదాలను తనలో కలుపుతుంది.తెలుగు బాష  కోటి కిటికీల గాలి మేడ. అన్నీ వైపుల నుండి వీచే గాలులను ఆహ్వానించి, ఆతిధ్యమిచ్చి గౌరవించింది. తెలుగుకి గల హృదయ వైశాల్యము అనన్యము. తెలుగు,సంస్కృత పదాలు క్షీరనీర న్యాయంలో కలిసిపోతాయి. అదే తెలుగు బాష విశిష్టత.

    మన తెలుగు కవులు: నన్నయ, తిక్కన, ఎఱ్ఱన తెలుగు పాండిత్యము తో మెప్పించిన ఉద్ధండ కవులు. మన తెలుగు కవులు అపార ప్రజ్ఞాధురీణులు. సంస్కృతాంధ్ర పదములు ప్రయోగించటం లో నేర్పరులు. పోతన సంస్కృతాంధ్ర పధములు ఇష్టమైన ఇద్దరినీ మెప్పిస్తానన్నాడు. పెద్దన మనుచరిత్ర లో ఇంతలు కన్నులుండ అని వ్రాసిన పధ్యము లోని తేట తెనుగు నుడికారపు సొంపులు, వంపులు, తామర తంపరలు, అల్లసాని వారి ఆ అల్లికజిగిబిగి లో తెలుగు పదములు, సంస్కృత శబ్ధములు పడుగుపెకల వలె అల్లుకుంటాయి. మన తెలుగు కవులంతా ఈ విధ్యలో నేర్పరులే. తెలుగు కవులకు జరిగిన సత్కార గౌరవములు ప్రపంచములో ఏ దేశంలో ఏ కవులకూ జరగలేదు.

    తెలుగువారి సహృదయత, సాహితీ రసికత, నిరుపమానములు. తెలుగు బాష వాజ్మయము లో ప్రాతఃస్మరణీయులు కవిత్రయము, నన్నయ్య ను రాజరాజు ఆదరించాడు. తిక్కన ను మనుసిద్ది, ఎఱ్ఱప్రెగడను వేమారెడ్డి గౌరవించారు. శ్రీనాథుడు రెడ్డి రాజుల కవిగా మహాభోగాలు అనుభవించాడు. ఆయనకు ప్రౌఢధేవరాయులు కనకాభిషేకం చేశాడు. పోతన మహాకవికి తమ హృదయంలోనే దేవాలయాలు కట్టి తెలుగువారు నేటికీ ఆరాదిస్తారు. సాహితీ బొజుడైన కృష్ణదేవరాయులు కవులను పూజించిన విషయము జగత్ ప్రసిద్దము. పెద్దన కవికి రాయులు గండపెండేరము తొడిగి గౌరవించాడు.

    Telugu is the Italian of the East: తెలుగు బాష సంగీతానికి అనువైన అజంత బాష. తెలుగు ఆజన్మ సంగీత కవచకుండలాలతో భాసించింది. సంగీత కళారాధనలో మన తెలుగు వారికి కలసి వచ్చిన గొప్ప అదృష్టం మన మాతృ బాష తెలుగు. తెలుగు బాషలో వచనానికి కూడా సంగీత సాహచర్యం ఉంది. తెలుగు పాటలో, పధ్యములో సంగీత సాహిత్యాలు గంగాయమున వలే సంగమించి ఉంటాయని సహృధయులందరికీ విదితమే. పధ్య కవిత్వంతో పాటు తెలుగు బాషలో వెలసిన పాటలు, స్త్రీల పాటలు, గేయాలు, కీర్తనలు, మరి ఏ ఇతర బాషల్లోనూ లేవు. రామధాసు కీర్తనలు తెలుగు దేశమంతా వ్యాపించాయి. తాళ్ళపాక అన్నమాచార్యులు ముప్పై రెండు వేల కీర్తనలు రచించాడు. తెలుగు వారి కళాభినివేశమునకు, మూర్తీభవించిన పారాకాష్ట త్యాగరాజు.

    మాతృబాషలో విధ్యాబోధన:  గాంధీజీ 1938 లో తన హరిజన పత్రికలో బాలబాలికలకు ఆంగ్లము ద్వారా విధ్యాబోధన చెయ్యడాన్ని తప్పు పట్టారు. నిజమైన భావ ప్రేరేపణ, ప్రగతి, మాతృబాష వల్లనే వస్తుందని, స్వబాషలో విధ్య ఉంటే, మనకు స్వరాజ్యం ఎప్పుడో వచ్చేదని ‘గాంధీజీ’ వ్రాశారు. మాతృబాషలో విధ్యాబోధన వల్ల మనసులు చురుకుగా పనిచేస్తాయని, రవీంధ్రుడు అన్నాడు.

    మాతృబాషలో  విధ్యాబోధన వల్ల గ్రహణ సామర్ధ్యం పెరుగుతుందని శాస్త్రజ్ఞులు అంటున్నారు. “మాతృబాషలో విధ్యాబోధన వల్ల విధార్ధులలో సృజనాత్మకత పెరుగుతుంది”.

    మాతృబాష తల్లి పాల వంటిది. పరబాష పోతపాల వంటిది.అని కొమర్రాజు లక్ష్మణరావు గారు అన్న మాట సత్యము.

    అధికార బాషగా తెలుగు: తెలుగును పరిపాలనా బాషగా చేయాలని ఎన్నో ప్రయత్నాలు జరిగాయి. చివరకు 1966 లో తెలుగును అధికారాబాష గా ప్రవేశపెట్టిన బిల్లు చట్టం అయింది. ప్రబుత్వ శాఖలు తెలుగులోనే ఉత్తర ప్రత్యుత్తరాలు నడపాలని 1966 డిసెంబర్ లో ఉత్తర్వులు వచ్చాయి. పరిపాలనా బాషగా తెలుగు స్వరూపం ఎలా ఉండాలో నిర్ణయించటానికి పింగళి లక్ష్మీకాంతం, జి.ఆర్.పి గ్విన్ ల అధ్యక్షతన సంఘాలు ఏర్పడ్డాయి. ప్రబుత్వంలో ఒక శాఖగా 1974 మార్చి 19 న “అధికార బాష సంఘం” ఏర్పడింది.

    తెలుగు భోదనా భాషగా అమలుకు సూచనలు:  ప్రజాస్వామ్య యుగంలో ప్రజల బాషలో పరిపాలన సాగించాలి. పాలకుల బాష ఒకటి, పాలితుల బాష మరొకటి అయితే, పరిపాలన అడవిని కాచిన వెన్నెల అవుతుంది. ప్రజలకి తమ బాషలో సమస్యలని చెప్పుకొనే హక్కు ఉండాలి. అధికారులు తెలుగులో వివరించే బాధ్యతని కలిగి ఉండాలి. మాతృబాషలో విధ్యార్జన సులభం. ఇది గమన సామర్ధ్యాన్ని, జ్ఞానాన్ని వేగవంతం చేస్తుంది, సృజనాత్మకతకు తోడ్పడుతుంది. అయితే తెలుగు బాషను ఆధునిక అవసరాలకు అనుగుణంగా అభివృద్ది చెయ్యాలి.

    • తెలుగులో పాఠ్యగ్రంథాలను ప్రచురిస్తూ, వాటిని మధ్యమధ్యన పరిష్కరిస్తూ ఉండాలి
    • సమగ్రమైన పారిభాషిక పద కోశాల్ని తయారుచేయించాలి.
    • వైజ్ఞానిక, సామాజిక విషయాలపై గ్రంథాలను విరివిరిగా అనువాదం చేయించాలి.
    • ప్రభుత్వము, తెలుగు అకాడమీ, విశ్వవిధ్యాలయాలు వంటి ద్వారా అన్ని స్థాయిలలో, తెలుగు బోధనా బాషగా అమలు చేసేంధుకు వీలుగా గ్రంథాలు రాయించాలి.
    • ప్రజల్లో చైతన్యం వచ్చి, ధీక్షతో, పట్టుదలతో తెలుగును బోధనా బాషగా అమలు చేయటంలో సహకరించాలి.
    • తెలుగును బోధనా బాషగా చదివిన వారికి సాధుపాయాలు కల్పించాలి.
    • తెలుగులో ఐ‌ఏ‌ఎస్, ఐ‌పి‌ఎస్ వంటి ఉన్నత పరీక్షలు వ్రాసే పద్దతిని అమలు చెయ్యాలి.
    • ప్రబుత్వ ఉత్తర్వులు, న్యాయస్థానాల తీర్పులు పూర్తిగా తెలుగులోనే ఉండాలి.
    • టైప్ రైటింగ్, షార్ట్ హాండ్, కంప్యూటర్ లలో తెలుగుకి ప్రాధాన్యం కల్పించాలి.

     సమాప్తి:

    • తెలుగు బాష పట్ల మమకారం అంకిత భావం ఉండాలి.
    • ప్రజల వద్దకు పాలన అన్నది తెలుగు బాషను పరిపాలనా బాషగా పూర్తిగా అమలు పరిచినప్పుడే సాధ్యమవుతుంది.
    • అభిమానం మాటలకే పరిమితమైతే దేశ బాషలందు తెలుగు లెస్స్”  అనే పరిహాసానికి గురికాక తప్పదు. కాబట్టి ప్రభుత్వం తెలుగు పట్ల శ్రద్ద వహించాలి.
    • అధికారులు, ప్రజలు ప్రభుత్వానికి సహకరించాలి. అప్పుడే తెలుగు వెలుగు నాలుదిక్కులా వ్యాపిస్తుంది.
    • ఈ విధంగా తెలుగును భోధనా బాషగా ప్రవేశపెట్టి, మన విధ్యార్థుల సర్వతోముఖ వికాసానికి ఫ్రబుత్వము, ప్రజలు కృషి చేయాలి.

     కూన రసజ్ఞ,
    10వ తరగతి,
    శ్రీ సరస్వతి జ్ఞాన మందిర్ ఉన్నత పాఠశాల,
    బుధవార్ పేట్, నిర్మల్,
    నిర్మల్ (మం), ఆధిలాబాద్ జిల్లా.

  • తెలుగు బాష ప్రాముఖ్యత (ధ్వితీయ బహుమతి పొందిన వ్యాసం)

    మాతృ బాష యొక్క ప్రాముఖ్యత

    ఉపోధ్ఘాతం:

    మాతృమూర్తిపై, మాతృభూమిపై, మనసున్న ప్రతి మనిషికీ అవ్యాజమైన ప్రేమ, గౌరవం ఉంటుంది. అందుకే, “మాతృదేవోభవ” అని మనకు జన్మనిచ్చిన తల్లిని మొట్టమొదటగా స్మరించుకుంటున్నాం. ‘తల్లి ఒడి మొదటి బడి’ అన్నారు. వ్యక్తి జీవితంలో మొదట నేర్చుకునే బాష మాతృబాష. “జననీ జన్మ భూమిశ్చ, స్వర్గాధపి గరీయసి” అనడంలో మాత, మాతృభూమి, స్వర్గం కంటే మిన్న అని తెలుస్తుంది. మాతృబాష సహజంగా అబ్బుతుంది. అప్రయత్నంగా వచ్చేదే మాతృబాష.

     మాతృబాష:

    Mother Tongue అనే ఆంగ్ల పదానికి సమానార్ధకంగా నేడు మాతృబాష అనే పదం వ్యవహారంలో ఉంది. శిశువు మొట్టమొధటిసారిగా తానొక బాషను నేర్చుకుంటున్నాననే జ్ఞానం లేనప్పుడు, తనలో ఉన్న అనుకరణ అనే సహజ ప్రవృత్తితో తన పరిసరాలలోని వారి బాషణాన్ని అనుకరిస్తూ, జీవితంలో  మొట్టమొదటిసారిగా నేర్చుకునే బాషే “మాతృబాష”. శిశువు సౌంధర్య దృష్టిని ఆనందానుభూతిని వ్యక్తం చేయటానికి ఉపయోగపడేది మాతృబాష అని గాంధీజీ భావించారు. “దేశ భాషలందు తెలుగు లెస్స” అని సాహితీ సమరాంగణ సార్వభౌముడైన శ్రీ కృష్ణదేవరాయులు ఆముక్తమాల్యధ లో తన ఇష్ట ధైవమైన శ్రీకాకుళాంధ్ర మహావిష్ణువు తో చెప్పించారు.

     మాతృబాష విశిష్టత – ప్రాముఖ్యత:

    మన మాతృబాష తెలుగు. మాతృబాష సహజంగా అలవడుతుంది. అప్రయత్నంగా, సహజంగా వచ్చేది మాతృబాష. ఏ బాషను శిశువు అసంకల్పితంగా మాట్లాడతాడో, ఏ బాష ఇతర బాషల అభ్యసనం పై ప్రభావం చూపుతుందో ఆ బాషనే మాతృబాష అంటారు.

    వ్యక్తిత్వం:

    తెలుగు బాష స్వతంత్రమైన బాష. తెలుగు బాష సహజ స్వరూపం ఈ బాషలోని మూల పదాలైన సంఖ్యావాచకాలు, సంబంధ నామ వాచకాలు,  సర్వనామాలలో కనపడుతుంది.

    లిపి:

    తెలుగువారు మొదటి నుండీ రాత విషయంలో చాలా పట్టింపుతో ఆణిముత్యాల వలే, ముత్యాలకోవ వలే రాసే అలవాటు చేసుకున్నట్లు మన సాహిత్యంలో నిదర్శనాలున్నాయి. దేశంలో లీపులలో లేని అందం తెలుగు లిపిలో ఉన్నట్లు గుర్తించవచ్చు. ప్రస్తుత లిపి సుంధరమై, ఆకర్షణీయంగా ఉంది.

    వర్ణమాల:

    తెలుగు బాషకు ఏ బాషాకూ లేనంత వర్ణమాల ఉంది. ఈ బాషను నేర్చుకోవటం కష్టంగా తోచినా, ఈ వర్ణమాల వలన కలిగే ప్రయోజనం తెలిస్తే దీనిని శ్రమగా భావించలేరు. ఆంగ్లబాషలో వర్ణక్రమం, ఉచ్చారణాలకు పొందిక  లేకపోవటానికి వర్ణమాల చిన్నది కావడమే కారణమని, అంధువల్ల వర్ణమాలను నేర్చుకోవడం సులభమైన ఆ భాషలో పఠన, లేఖన, సంబాషణాదులను అభ్యసించడం కష్టమని అంగీకరించక తప్పధు.

    ఉచ్చారణ:  

    వేధపఠనం విన్నవారికి ఉచ్చరణలో ఉన్న ఆకర్షణ, మాధుర్యం తెలుస్తుంది. అంధుకు మూల కారణం మన బాషలోని స్వర విశేషమే.

    స్పష్టత:

    ఏ బాషకూ లేనంత అచ్చులా సంపద ఉండి, ఆయా బాషలలాగా హలంతంగాక , పద మధ్యంలో అక్షరాలను హల్లులలాగే తేల్చి మింగి పలికే బాష కాకపోవటంతో, ఆ బాషలలో లేని స్పష్టత, అవగాహనా సౌలభ్యం తెలుగు బాషాకు ప్రత్యేక లక్షణాలుగా బాషిస్తున్నాయి.

    శ్రావ్యత:

    తెలుగు బాష అజంత బాష కావటం వలన ప్రతి పదాన్ని స్పష్టంగా పలికే వీలవుతోంది. అజంతమవడంలో ఈ బాషకు స్పష్టతే కాకుండా శ్రావ్యత కూడా సమకూరింది. స్వాతిశయాభిమానానికి పేరువదిన పలువురు సంగీతంలో పారమ్య సంపాదనకు త్యాగరాజ కృతులను అభ్యసింపక తప్పుట లేదనడమే తెలుగుభాషలోని ప్రత్యేకతకు నిదర్శనం.

    మాధుర్యం:

    తెలుగు మాధుర్యం మన దేశీయులనే కాకుండా, విదేశీయులను కూడా ఆకర్షించ గలగడం విశేషం. దీనికి శ్రీ సి.పి బ్రౌన్ తెలుగు బాష గురించి చేసిన ప్రశంసమే తార్కాణం.

    సంధి:

    సంధి ఈ బాషకుగల సహజ లక్షణం.  ఉధా: చింత-ఆకు, ఏమి – అది, ఏమి – అన్నాను, దాని – అంత మొదలగునవి .

    సారళ్యం:

    సంస్కృత బాషలో అరుధైన సారళ్యం తెలుగు బాషలో కుదురుకొని ఉండటం మరొక విశేషం.

    సౌకుమారం:

    దీర్ఘాలైన మాతలుగానీ, సమాసాలుగానీ లేకుండా ఆలతి పదాల కూర్పు తెలుగు భాషా సౌకుమార్యతకు, సోయగానికి వృష్టాంతమవుతుందోంది.

    గాంభీర్యం:

    సంస్కృత భాష నుంచి సంక్రమించిన స్థిరాక్షర మహాప్రాణధుల వల్ల శబ్ధగాంబీర్యం చేకూరి ఎంతటి గంభీర భావాన్నైనా ప్రకటించగల సామర్ధ్యం ఈ బాషకు అలవడింది.

    జంట కట్టుట:

    ఇది ఈ బాషకు గల వేశేష లక్షణం. ఆటా-పాటా, మాటా-మంతి మొదలగునవి.

    యతి ప్రాసలు:

    యతిప్రాసలు ఈ బాషకు జీవగఱ్ఱ. వీటివల్ల దీనికి కలుగుతున్న సొగసు, మాధుర్యం ఇంతింత అని చెప్పలేం. తెలుగువారి వ్యవహారంలో ఇవి అప్రయత్నంగా ప్రత్యక్షమవుతాయి. ఇవి అసామాన్య లక్షణాలు కలిగి ఉండటం వల్లనే “దేశబాషలంధు తెలుగు లెస్స” అని కవి సార్వభౌముడు శ్రీనాథుడు కీర్తించాడు.

    విదేశీయుల ప్రశంశలు:

    ఆనాటి రాయలచేతనేకాక తెలుగుబాష ప్రాచ్య భాషలో మాధురీభరితమై మకుటాయమానము అవుతోందని పాశ్చాత్యులూ ప్రస్తుతించారు. ఆ గౌరవం పొందటానికి తెలుగుబాషకుగల అర్హత మరి ఏ ఇతర బాషలకు లేదని అయితే, విజ్ఞాన సాంకేతిక పదజాలనికది పుట్టినిల్లు కాగలదని వక్కాణించారు.

    అధికార బాషగా తెలుగు:

    ఒక జాతి సాంస్కృతిక అభివృద్దికి కీలకమైన వాటిలో భాష కూడా ఒకటి. ఒక జాతి నాగరికతను, సంస్కృతిని, ప్రజాజీవనాన్ని బాష ప్రతిభింబిస్తుంది. బాష కేవలం భావవ్యక్తీకరణ, బావ ప్రకటన సాధనంగానేకాక, భావాలను సమైఖ్యపరిచి భిన్నత్వంలో ఏకత్వాన్ని సాధించటానికి దోహదం చేస్తుంది. పరిపాలన నిర్వహించడానికి ప్రపంచంలో ఏ దేశంలోనైనా, ఏ ప్రాంతంలోనైనా అత్యధిక సంఖ్యాకులు మాట్లాడే భాష అధికార భాష అవుతోంది.

    బోధన మాధ్యమంగా తెలుగు ప్రయోజనాలు:

    బోధన మాధ్యమంగా తెలుగు ఉండటంవల్ల కలిగే ప్రయోజనాలు క్రింది విధంగా ఉన్నాయి,

    • మాతృబాషలో విషయాన్ని వ్యక్తం చేయడం, బోధించడం, అభాసించడం సులభం.
    • మాతృభాషలో అధ్యయనం వల్ల కంఠస్థం చేయకుండా భావాలను గుర్తుపెట్టుకొని రాయవచ్చు.
    • మాతృభాషలో విధ్యార్థి స్వయంగా చదివి విజ్ఞానాన్ని పెంపొందించుకొంటాడు.
    • మాతృభాష మాధ్యమం వల్ల దేశీయ భాషలు అభివృద్ది చెందుతాయి.
    • మాతృభాష మాధ్యమంవల్ల అధ్యయనం చురుకుగా సాగుతోంది.
    • సామాజిక స్పృహ పెంపొందుతుంది.
    • మాతృభాష మాధ్యమంలో విధ్యార్ధులకు అభ్యసనం క్రీడలా తోచి మానసిక శ్రమ, అలసట లేకుండా ఉల్లాసంగా వివిధ విషయాలను సులభంగా నేర్చుకొంటాడు.
    • మాతృభాషా మాధ్యమంలో చదవడంవల్ల ఆ భాషకు తగిన గౌరవం కల్పించిన వారమవుతాం.

    బోధనా మాధ్యమంగా తెలుగులో సమస్యలు:

    బోధనా మాధ్యమంగా తెలుగు అమలులో పలు సమస్యలు ఉన్నాయి. అందులో ముఖ్యమైనవి

    1. అనువాద సమస్యలు
    2. విదేశీ ఉధ్యోగాల సమస్య
    3. పోటీ పరీక్షలలో సమస్యలు

    అనువాద  సమస్య:

    ఆంగ్ల బాషలో ఉన్న గ్రంథాలను తెలుగులోకి అనువదించటం కష్టమని కొందరంటారు. పారిభాషిక పదాలకు సరైన పదాలను తెలుగులో రాయలేమని కొందరు బావిస్తారు.

    నివారణ:

    నన్నయ్యకు ముందు తెలుగులో రచనలు లేనప్పుడు, సంస్కృత పదాలకు కొన్ని చేర్పులు చేసి తెలుగు పధాలుగా తెలుగులో భారతానువాదం చేయలేదా??

    విదేశీ ఉధ్యోగాల సమస్య:

    ఇతర రాష్ట్రాలకు, ఇతర దేశాలకు వెళ్ళి ఉధ్యోగాలు చెయ్యాలంటే, తెలుగు మాధ్యమంలో చదివినవారు పనికిరారని, ఆంగ్లమాధ్యమంలో చదివినవారే పనికివస్తారని ఒక అభిప్రాయం.

    నివారణ:

    గతంలో అధికార భాషా సంఘం అధ్యక్షులుగా పనిచేసిన వావిలాల గోపాలకృష్ణయ్య ఏమన్నారో చూడండి. ‘ఇంగ్లీష్ లో చదివిన అందరికీ ఉధ్యోగాలిస్తే, నా ఉధ్యమం మానుకుంటాను’. అమెరికా పోయే నాలుగురికోసం అంతా ఇంగ్లీష్ లోనే చదవాలా?. కానీ మనదేశంలో  తృభాషా సూత్రం ప్రకారం మూడు భాషలు కొన్ని రాష్ట్రాల వారు విధిగా నేర్చుకున్నా, ఆంగ్ల బాషను తప్పకుండా నేర్చుకుంటున్నారు.

    పోటీ పరీక్షలలో సమస్యలు:

    అఖిలభారత సర్వీసులకు, మెడికల్. ఇంజనీరింగ్ వంటి పోత్ర్ర్ పరీక్షలలో ఆంగ్ల మాధ్యమంలో చదివిన విధ్యార్థులే రాణిస్తారని, మాతృబాషలో చదివిన వారు రాణించలేరని అనుకోవడం పొరపాటు. ఈ మధ్యకాలంలో పలువురు గ్రామీణ విధ్యార్థులు, మాతృభాష మాధ్యమంగా చదివినవారు పోటీ పరీక్షలలో, ఉధ్యోగాల అర్హత పరీక్షలలో అత్యుథ్హమ ప్రతిభను ఛాతీ కేంధ్ర సివిల్ సర్వీసెస్ ఉధ్యోగాలకు ఎంపిక అవుతున్నారు.

    ఇతర నైపుణ్యాలు:

    ఉపాధ్యాయుడికి అన్యాశాస్త్రాలు, భాషాసాహిత్యాలు పరిచయం ఉండాలి. తెలుగు భాష పై, సాహిత్యం పై ప్రభావం చూపిన ఇతరదేశ భాషలు, వాటి సాహిత్యాలు పరిచయం ఉండాలి

    ముగింపు:

    ప్రస్తుతం ప్రపంచంలో తెలుగు భాష పలుచోట్ల వాడుకలో ఉంది. ప్రపంచంలో 16వ స్థానంలో ఉంది. దేశంలో రెండవ స్థానంలో ఉంది. ఈ విధంగా తెలుగు ప్రపంచ భాషగా ఒక గొప్ప విశిష్టతను కలిగి ఉంది. అధికార భాషగా తెలుగు అమలుకు ప్రతి ఒక్కరూ చిత్తశుద్దితో వ్యవహరించాలి. సెలవు చీటి ధగ్గర నుండి ఆఫీసు వ్యవహారం వరకు కచ్చితంగా తెలుగునే అమలు చెయ్యాలి

     అల్లు మంగ,
    10వ తరగతి. జిల్లా ప్రజాపరిషత్ ఉన్నత పాఠశాల,
    పెదనందిపల్లి గ్రామం, దేవరాపల్లి మండలం, విశాఖపట్నం జిల్లా

  • తెలుగు బాష ప్రాముఖ్యత (తృతీయ బహుమతి పొందిన వ్యాసం -౨)

    తెలుగు బాష ప్రాముఖ్యత 

     “దేశ  భాషలందు తెలుగు లెస్స” అని శ్రీకృష్ణదేవరాయలు వారు అన్న మాటకు అర్థం మన దేశంలో ఎన్నిభాషలున్నా సరే ఏ భాష కూడా తెలుగుతో పోటీ పడలేదు అని. తెలుగు భాషలోని మాధుర్యం అంతా ఇంతా కాదు. ఉగ్గు పాల నుండి ఒక బిడ్డకి తల్లి పాట పాడేందుకు వీలైన భాష.తెలుగు భాషలోని స్పష్టత, నేర్పు, భావం, కూర్పు చాలా అందంగా ఉంటాయి. ఎందరో మహనీయులు, కవులు, కవయిత్రులు మన తెలుగు భాష యొక్క ప్రాముఖ్యతను గురించి చాటిచెప్పారు.

    అందులో ప్రప్రధమంగా  నన్నయ, తిక్కన, యెఱ్ఱాప్రగడలు మహాభారతం వంటి గొప్పకావ్యాన్ని సంస్కృతం నుండి తెలుగులోకి, సామాన్య మనవుడికి అర్థమయ్యే విధంగా, చక్కగా అనువదించారు.ఆ కవిత్రయానికి జోహార్లు. వీరేకాక, గురజాడ అప్పారావు, వీరేశలింగం పంతులు, శ్రీశ్రీ, సి.నా.రె మొదలైన కవుల వరకు అందరూ ఎన్నో గొప్ప తెలుగు కావ్యాలు, కథలు రచించారు.

    తెలుగులో కవిత్వం మన ఆది కవి “నన్నయ” గారి మహాభారతం నుండి అంటే 11వ శతాబ్దం నుండి మొదలైంది  అనుకోవడంలో ఎటువంటి  సందేహమూ లేదు. తెలుగు భాష తేనె వలె మధురంగా ఉంటుంది. “సంస్కృతంలోని చక్కెర పాకం, అరవభాష లోని అమృతరాశి, కన్నడ భాష లోని తేట,ఇవన్నీ తెలుగు నందు కలవు” అని శ్రీకృష్ణదేవరాయల వారు తెలిపారు. తెలుగు భాష ద్రావిడ భాష నుండి వచ్చింది. ద్రావిడ భాషలు మొత్తం 21 అని ఒకానొక సందర్భంలో తెలిసింది. అందులో మన తెలుగు కూడా ఒకటి. తెలుగు లిపి కన్నడ లిపితో పోలియుండును. మనదేశంలో ఒక్కో రాష్ట్రంలో ఒక్కో భాష మాట్లాడతారు.

    500-600 సంవత్సరాల క్రితం శాతహవాహనుల పరిపాలన కాలంలో “ప్రకృత్” అనే భాష మన ఆంధ్రప్రదేశ్ లో వాడటం జరిగింది. కానీ ఆ ప్రకృత్ భాషలోని తద్బావాలను కలిపి తెలుగుగా మార్చడం జరిగింది. ప్రకృత్  భాష కనుమరుగైంది,కానీ మన తెలుగు మాత్రం తేనెలా ఊరిస్తూనే ఉంది. మన తెలుగు భాషకి “తెనుగు భాష”, ఆంధ్రభాష  అను పర్యాయ పదాలు కలవు. తెలుగు భాషలోని అక్షరాలు 56 ఉండేవి. 18 అచ్చులు మరియు 38 హల్లులు ఉండేవి. కానీ, ఇప్పటి పాఠ్యప్రణాళిక ప్రకారం 16 అచ్చులు,36 హల్లులు గా మారిపోయినవి.

    తెలుగు భాష సంస్కృతం నుండి తీసుకొన బడింది. కానీ, లిపి వరకు వస్తే సంస్కృత భాష “దేవనాగిరి”లిపి లో ఉండును. తెలుగు బ్రహ్మ లిపిలో ఉండును. విజయనగర సామ్రాజ్య పరిపాలన నుండి తెలుగు యొక్క ప్రాదాన్యతపెరిగెను. రాయలవారి పాలనలో అష్టదిగ్గజాలు ఉండేవారు. వారందరూ తెలుగు భాషలో పండితోత్తములు.

    తెలుగు వ్యాకరణ  దిశగా చూసినా, పలికే విధానం దిశగా చూసిన ,ఎటు చూసిన తెలుగు భాష కి తెలుగే సాటి,వేరేదిలేదు దీనికి పోటీ. ఒక్క తెలుగు  భాషలో మాత్రమే “అష్టావదానం”, “శతావదనం”  “సహస్రావదనం” “సమస్యాపూర్ణం” అనే అంశాలు ఉండును. వేరే ఏ  భాషకు కూడా ఈ విధమైనా సౌకర్యం వీలుపడదు.తెలుగు భాష  గురించి ఎంత చెప్పినా, వ్రాసినా, చదివినా, విన్నా తనవి తీరదు. అంతటి మధురమైనది మన తెలుగు భాష. దక్షిణ భారతదేశం మరియూ ఇతర (తెలుగువారు) ప్రదేశాల్లోతెలుగు వారు, తెలుగుమాట్లాడేవారి సంఖ్య 66 మిలియన్లు అంటే ఆశ్చర్యపోనక్కరలేదు. ఇంకా ఎంత చెప్పినా తెలుగు భాషయొక్క ప్రాముఖ్యత ముందు దిగదుడుపే.

    ఇలాంటి  తెలుగు భాషని మనలో చాలా మంది నిర్లక్ష్యం చేస్తున్నారు.కొందరు తెలుగు మాట్లాడడానికే అసహ్యించుకుంటున్నారు. మరికొందరు తెలుగు మాట్లాడేవారిని దగ్గరకు కూడా రానివ్వరు. ప్రాశ్చ్యత్య దేశ భాషల, ఇతర భాషల యొక్క ప్రాముఖ్యతను పెంచుతున్నారే తప్ప తెలగుభాష కనీస గౌరవం కూడా ఇవ్వరు. తెలుగు వారమంతా ఎంతో వీలుగా, సౌకర్యంగా  ఉండే తెలుగుని మాట్లాడటమే మానేసారు.

    ఇకపోతే ఇప్పటి కాలం పిల్లలు, వారి సంగతి అసలు చెప్పనే వద్దు, తెలుగు పదాలే మర్చిపోతున్నారు. తెలుగు భాష యొక్క గొప్పతనం, తెలుగు జాతి తీయదనం తెలుసుకున్న వాళ్ళకి తెలుగే ఒక మూలధనం అని ఒక కవి చాలా గొప్పగా చెప్పారు. పిల్లలు తెలుగులో మాట్లాడకుండా ఉండటానికి చాలా కారణాలు ఉండవచ్చు, వారు పెరుగుతున్న వాతావరణం, తల్లిదండ్రులు, పాఠశాలలు, స్నేహితులు మొదలైనవి. మొదటి పదమైన “అమ్మ” అనే పదానికి బదులు మమ్మీ, మామ్ అని అక్కడ నుంచి ప్రతి పదం, ప్రతీ సందర్బం,ప్రతీచోట కూడా పిల్లలు తెలుగుకి బదులుగా ఇతర భాషలపై మోజూ చూపుతారు. పిల్లలే కాదు, పెద్దవారు కూడా తెలుగులో మాట్లాడితే అదేదో తప్పని లేదా చుట్టు ప్రక్కలవాళ్లు మనకు నాగరికత అనేది తెలీయదని అనుకుంటారని వారు కూడా ఇతర భాషలలొ మాటాడటం మొదలు పెడతారు. ఇది చూసిన పిల్లలు ఇదే పద్దతిని పాటిస్తారు, కానీ అది తప్పు.ఎవరి మాతృభాష లో వారు మాట్లాడటం వారి హక్కు.అలా అని అభివృద్ది చెందకూడదని కాదు.(నాగరికత విషయంలో).పరభాషా జ్ఞానాన్ని సంపాదించుకోవడంలో తప్పు లేదు.కానీ సంబోధనా సమయంలోనైనా మన భాషని మనం మరచిపోరాదు.

    ప్రాశ్చ్యత్య దేశాలు సైతం మన  భాషను, మన భాషలోని కమ్మదనాన్ని మెచ్చుకొని ఆదరిస్తున్నపుడు మనం మన తెలుగు భాషని అగౌర్వించడం బావ్యం కాదు. దయచేసి తెలుగువారందరము తెలుగులోనే మాట్లాడుదాము. పాఠశాలలో కూడా తెలుగు భాషను /తెలుగు భాషలోని గొప్పదనాన్ని పాఠ్యాంశాల రూపంలో ప్రచురించినచో విద్యార్ధిని, విద్యార్థులకు బాల్యములోనే తెలుగు భాషయొక్క ప్రాముఖ్యతను గురించి అవగాహన ఏర్పడును.

    కె. ఐశ్వర్య,
    6వ తరగతి, సాధు వశ్వని ఇంటర్నేషనల్ స్కూల్,
    కొంపల్లి, జయభేరి పార్క్, హైదరాబాద్

  • తెలుగు బాష ప్రాముఖ్యత (తృతీయ బహుమతి పొందిన వ్యాసం)

    తెలుగు బాష ప్రాముఖ్యత 

     “దేశ  భాషలందు తెలుగు లెస్స” అని శ్రీకృష్ణదేవరాయలు వారు అన్న మాటకు అర్థం మన దేశంలో ఎన్నిభాషలున్నా సరే ఏ భాష కూడా తెలుగుతో పోటీ పడలేదు అని. తెలుగు భాషలోని మాధుర్యం అంతా ఇంతా కాదు. ఉగ్గు పాల నుండి ఒక బిడ్డకి తల్లి పాట పాడేందుకు వీలైన భాష.తెలుగు భాషలోని స్పష్టత, నేర్పు, భావం, కూర్పు చాలా అందంగా ఉంటాయి. ఎందరో మహనీయులు, కవులు, కవయిత్రులు మన తెలుగు భాష యొక్క ప్రాముఖ్యతను గురించి చాటిచెప్పారు.

     

    అందులో ప్రప్రధమంగా  నన్నయ, తిక్కన, యెఱ్ఱాప్రగడలు మహాభారతం వంటి గొప్పకావ్యాన్ని సంస్కృతం నుండి తెలుగులోకి, సామాన్య మనవుడికి అర్థమయ్యే విధంగా, చక్కగా అనువదించారు.ఆ కవిత్రయానికి జోహార్లు. వీరేకాక, గురజాడ అప్పారావు, వీరేశలింగం పంతులు, శ్రీశ్రీ, సి.నా.రె మొదలైన కవుల వరకు అందరూ ఎన్నో గొప్ప తెలుగు కావ్యాలు, కథలు రచించారు.

    తెలుగులో కవిత్వం మన ఆది కవి “నన్నయ” గారి మహాభారతం నుండి అంటే 11వ శతాబ్దం నుండి మొదలైంది  అనుకోవడంలో ఎటువంటి  సందేహమూ లేదు. తెలుగు భాష తేనె వలె మధురంగా ఉంటుంది. “సంస్కృతంలోని చక్కెర పాకం, అరవభాష లోని అమృతరాశి, కన్నడ భాష లోని తేట,ఇవన్నీ తెలుగు నందు కలవు” అని శ్రీకృష్ణదేవరాయల వారు తెలిపారు. తెలుగు భాష ద్రావిడ భాష నుండి వచ్చింది. ద్రావిడ భాషలు మొత్తం 21 అని ఒకానొక సందర్భంలో తెలిసింది. అందులో మన తెలుగు కూడా ఒకటి. తెలుగు లిపి కన్నడ లిపితో పోలియుండును. మనదేశంలో ఒక్కో రాష్ట్రంలో ఒక్కో భాష మాట్లాడతారు.

    500-600 సంవత్సరాల క్రితం శాతహవాహనుల పరిపాలన కాలంలో “ప్రకృత్” అనే భాష మన ఆంధ్రప్రదేశ్ లో వాడటం జరిగింది. కానీ ఆ ప్రకృత్ భాషలోని తద్బావాలను కలిపి తెలుగుగా మార్చడం జరిగింది. ప్రకృత్  భాష కనుమరుగైంది,కానీ మన తెలుగు మాత్రం తేనెలా ఊరిస్తూనే ఉంది. మన తెలుగు భాషకి “తెనుగు భాష”, ఆంధ్రభాష  అను పర్యాయ పదాలు కలవు. తెలుగు భాషలోని అక్షరాలు 56 ఉండేవి. 18 అచ్చులు మరియు 38 హల్లులు ఉండేవి. కానీ, ఇప్పటి పాఠ్యప్రణాళిక ప్రకారం 16 అచ్చులు,36 హల్లులు గా మారిపోయినవి.

    తెలుగు భాష సంస్కృతం నుండి తీసుకొన బడింది. కానీ, లిపి వరకు వస్తే సంస్కృత భాష “దేవనాగిరి”లిపి లో ఉండును. తెలుగు బ్రహ్మ లిపిలో ఉండును. విజయనగర సామ్రాజ్య పరిపాలన నుండి తెలుగు యొక్క ప్రాదాన్యతపెరిగెను. రాయలవారి పాలనలో అష్టదిగ్గజాలు ఉండేవారు. వారందరూ తెలుగు భాషలో పండితోత్తములు.

    తెలుగు వ్యాకరణ  దిశగా చూసినా, పలికే విధానం దిశగా చూసిన ,ఎటు చూసిన తెలుగు భాష కి తెలుగే సాటి,వేరేదిలేదు దీనికి పోటీ. ఒక్క తెలుగు  భాషలో మాత్రమే “అష్టావదానం”, “శతావదనం”  “సహస్రావదనం” “సమస్యాపూర్ణం” అనే అంశాలు ఉండును. వేరే ఏ  భాషకు కూడా ఈ విధమైనా సౌకర్యం వీలుపడదు.తెలుగు భాష  గురించి ఎంత చెప్పినా, వ్రాసినా, చదివినా, విన్నా తనవి తీరదు. అంతటి మధురమైనది మన తెలుగు భాష. దక్షిణ భారతదేశం మరియూ ఇతర (తెలుగువారు) ప్రదేశాల్లోతెలుగు వారు, తెలుగుమాట్లాడేవారి సంఖ్య 66 మిలియన్లు అంటే ఆశ్చర్యపోనక్కరలేదు. ఇంకా ఎంత చెప్పినా తెలుగు భాషయొక్క ప్రాముఖ్యత ముందు దిగదుడుపే.

    ఇలాంటి  తెలుగు భాషని మనలో చాలా మంది నిర్లక్ష్యం చేస్తున్నారు.కొందరు తెలుగు మాట్లాడడానికే అసహ్యించుకుంటున్నారు. మరికొందరు తెలుగు మాట్లాడేవారిని దగ్గరకు కూడా రానివ్వరు. ప్రాశ్చ్యత్య దేశ భాషల, ఇతర భాషల యొక్క ప్రాముఖ్యతను పెంచుతున్నారే తప్ప తెలగుభాష కనీస గౌరవం కూడా ఇవ్వరు. తెలుగు వారమంతా ఎంతో వీలుగా, సౌకర్యంగా  ఉండే తెలుగుని మాట్లాడటమే మానేసారు.

    ఇకపోతే ఇప్పటి కాలం పిల్లలు, వారి సంగతి అసలు చెప్పనే వద్దు, తెలుగు పదాలే మర్చిపోతున్నారు. తెలుగు భాష యొక్క గొప్పతనం, తెలుగు జాతి తీయదనం తెలుసుకున్న వాళ్ళకి తెలుగే ఒక మూలధనం అని ఒక కవి చాలా గొప్పగా చెప్పారు. పిల్లలు తెలుగులో మాట్లాడకుండా ఉండటానికి చాలా కారణాలు ఉండవచ్చు, వారు పెరుగుతున్న వాతావరణం, తల్లిదండ్రులు, పాఠశాలలు, స్నేహితులు మొదలైనవి. మొదటి పదమైన “అమ్మ” అనే పదానికి బదులు మమ్మీ, మామ్ అని అక్కడ నుంచి ప్రతి పదం, ప్రతీ సందర్బం,ప్రతీచోట కూడా పిల్లలు తెలుగుకి బదులుగా ఇతర భాషలపై మోజూ చూపుతారు. పిల్లలే కాదు, పెద్దవారు కూడా తెలుగులో మాట్లాడితే అదేదో తప్పని లేదా చుట్టు ప్రక్కలవాళ్లు మనకు నాగరికత అనేది తెలీయదని అనుకుంటారని వారు కూడా ఇతర భాషలలొ మాటాడటం మొదలు పెడతారు. ఇది చూసిన పిల్లలు ఇదే పద్దతిని పాటిస్తారు, కానీ అది తప్పు.ఎవరి మాతృభాష లో వారు మాట్లాడటం వారి హక్కు.అలా అని అభివృద్ది చెందకూడదని కాదు.(నాగరికత విషయంలో).పరభాషా జ్ఞానాన్ని సంపాదించుకోవడంలో తప్పు లేదు.కానీ సంబోధనా సమయంలోనైనా మన భాషని మనం మరచిపోరాదు.

    ప్రాశ్చ్యత్య దేశాలు సైతం మన  భాషను, మన భాషలోని కమ్మదనాన్ని మెచ్చుకొని ఆదరిస్తున్నపుడు మనం మన తెలుగు భాషని అగౌర్వించడం బావ్యం కాదు. దయచేసి తెలుగువారందరము తెలుగులోనే మాట్లాడుదాము. పాఠశాలలో కూడా తెలుగు భాషను /తెలుగు భాషలోని గొప్పదనాన్ని పాఠ్యాంశాల రూపంలో ప్రచురించినచో విద్యార్ధిని, విద్యార్థులకు బాల్యములోనే తెలుగు భాషయొక్క ప్రాముఖ్యతను గురించి అవగాహన ఏర్పడును.

    కె. ఐశ్వర్య,
    6వ తరగతి, సాధు వశ్వని ఇంటర్నేషనల్ స్కూల్,
    కొంపల్లి, జయభేరి పార్క్, హైదరాబాద్